టీటీడీలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంటోంది.మొన్నటివరకు టీటీడీ కొత్త పాలకవర్గం ఎంపికపై చెలరేగిన రగడ అంతా ఇంతా కాదు.
టీడీడీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ క్రిస్టియన్ సభలకు వెళ్తాడు అటువంటి వ్యక్తికి ఛైర్మెన్ గిరి ఎలా కట్టబెడతారు అంటూ వివాదం చెలరేగింది.ఆ తరువాత అది సద్దుమణిగిపోయింది.
ఇక అంతాక్ బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో మళ్ళీ టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేయడం సంచలనం రేపింది.
తిరుమల కొండపై టిటిడి అధికారులు ఆగమశాస్త్ర విరుద్ధంగా కార్యక్రమాలను నిర్వహించి ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నారని రమణ దీక్షితులు ధ్వజమెత్తారు.అంతేకాదు శ్రీవారి ఆభరణాలకు సంబంధించిన లెక్కలను అధికారులు వెంటనే బహిర్గతం చేయాలని రమణదీక్షితులు డిమాండ్ చేయడం, చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పాపాల వల్లే ప్రజల్లో అశాంతి నెలకొందని.అధికార పార్టీ అండతో టీటీడీలో చాలా మహాపచారాలు జరుగుతున్నాయని మంగళవారం టీటీడీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు ఆరోపణలు గుప్పించడంతో ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగింది.
అనుకున్నదే తడవుగా 65 ఏళ్లు దాటిన అర్చకులను పదవుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది.ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని ప్రకటించింది.దాంతో శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులు స్వామి వారికి సేవ చేసే అవకాశాన్ని తక్షణం కోల్పోయారు.టీటీడీ నిర్ణయంతో అర్చకులు నరసింహదీక్షితులు, శ్రీనివాసమూర్తి, నారాయణ దీక్షితులపైనా వేటు పడిపోయింది.
రాయితీ టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం సుప్రీం కోర్టు నిబంధనలకు వ్యతిరేకమని, మాకు రిటైర్మెంట్ వర్తించదని, మేమేమి టీడీడీ ఉద్యోగులం కాదని రమణ దీక్షితులు వ్యాఖ్యానిస్తున్నారు.కోర్టు ద్వారానే ఈ విషయాన్నీ తేల్చుకుంటామని అయన చెబుతున్నారు.
ఏది ఏమైనా తమను ఎవరు ప్రశ్నించినా ఫలితం ఇలాగే ఉంటుందని చెప్పకనే చెప్పాడు చంద్రబాబు.