కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ను అము చేస్తున్న విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాలు, చిన్న చిన్న దేవాలయాలను కూడా మూసి వేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.
కాని అసలు విషయం ఏంటీ అంటే దేవాలయాలను మూసి వేయలేదు.కేవలం దర్శనంను మాత్రమే నిలిపి వేశారు.
దేవాలయ్యాల్లో ప్రతి రోజు జరిగే నిత్య కైంకర్యాలు కూడా జరుగుతూనే ఉన్నాయంటూ పురోహితులు పదే పదే చెబుతున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం గుడి గురించి ప్రచారం జోరుగా సాగుతోంది.
పూజలు నిలిపేశారు, గర్భ గుడికి తాళం వేశారు అంటూ వదంతులు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో టీటీటీ ఈవో సింఘాల్ స్పందించారు.
మీడియాలో జరుగుతున్న ప్రచారంను నమ్మవద్దు.దేవాలయంలోకి భక్తులను అనుమతించడం లేదు తప్ప ప్రతి రోజు స్వామి వారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తామో ఎలాంటి కైకర్యాలు కళ్యాణాలు నిర్వహిస్తామో అవి అన్ని జరుగుతున్నాయి.
వివరాలకు ప్రతి రో టీటీటీ భక్తి ఛానెల్ చూడాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశాడు.ఏప్రిల్ 15 తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు దర్శనం విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.