ఈనెల 12న తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది.ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది.
ప్రధానంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై పాలకమండలి చర్చించనుంది.అదేవిధంగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఈ బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో.దర్శనాలు, భక్తులకు కావాల్సిన మౌలిక వసతులపై సమావేశంలో చర్చించనున్నారు.