భవిష్యత్తులో ఏడుకొండలవాడు కొలువుంటున్న తిరుమల పేరు చెబితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గర్తుకు రావాలట…! తిరుమలపై ఆయన ముద్ర వేస్తాడట….! ఎవరు వేస్తారు? తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) కొత్తగా ఛైర్మన్గా నియమితులైన చదలవాడ కృష్ణమూర్తి.ఆయన మంగళవారం టీటీడీ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు.చంద్రబాబు ఎన్నికలకు ముందు ఆయనకు హామీ ఇచ్చినట్లుగానే టీటీడీ ఛైర్మన్గా నియమించారు.మరి పదవి ఇచ్చినందుకు బాబుకు పేరు తీసుకురావాలి కదా.అందుకే తిరుమలను బాగా అభివృద్ధి చేస్తానన్నారు.బాబు హయాంలో తిరుమల బాగా అభివృద్ధి అయిందని అందరూ చెప్పుకోవాలనే ఆకాంక్ష వెలిబుచ్చారు.ఇదంతా బాగానే ఉందిగాని భక్తుల కష్టాలు తగ్గించేవిధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
విఐపీలు, వివిఐపీలు వచ్చినప్పుడల్లా సామాన్య భక్తులు యమ కష్టాలు పడుతున్నారు.ఇతరత్రా కూడా అవినీతి బాగా జరుగుతోంది.
ఇదంతా చదలవాడ అరికడితే ప్రజలు ఆయన పేరూ చెప్పుకుంటారు.