తెలంగాణాలో TSRTC ఓ కొత్త స్కీమ్ ను తీసుకువచ్చింది. ‘హైదరాబాద్ దర్శన్’ పేరుతో మంగళవారం స్టార్ట్ చేసింది.
ఇందులో భాగంగా 7 చారిత్రక ప్రదేశాల్లో తిప్పనుంది.ఈ జర్నీ 12 గంటల పాటు కొనసాగనుంది.
అలాగే ఫుడ్ కూడా ఉచితంగా అందజేస్తారు.ఉదయం 8.30 గంటలకు టూర్ స్టార్ట్ కాగా.రాత్రి 8 గంటలకు ముగియనుంది.ఉదయం 8.30 గంటలకు అల్ఫా హోటల్ నుంచి స్టార్ట్ అయ్యి, తిరిగి చివరగా అక్కడే బస్ నిలిచిపోనుంది.ఈ క్రమంలో ముందుగా బిర్లా మందిర్ చూడవచ్చును.
ఆ తర్వాత చౌమహల్లా ప్యాలెస్ తీసుకు వెళతారు.
మధ్యాహ్నం తారమతి బారదరీ రిసార్ట్ వద్ద గల హరిత హోటల్లో లంచ్ చేసి, భోజనం పూర్తయ్యాక గోల్కొండ ప్యాలెస్, కేబుల్ బ్రిడ్జీ, దుర్గం చెరువు పార్క్, తర్వాత హుస్సెన్ సాగర్లో గల NTR పార్క్ వద్దకు తీసుకెళతారు.మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో లగ్జరీ ఏసీలో ఈ టూర్ అందుబాటులో ఉంది.మెట్రో ఎక్స్ ప్రెస్లో పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.130 తీసుకుంటారు.అదే మెట్రో లగ్జరీలో పెద్దలకు రూ.450, పిల్లలకు రూ.340 తీసుకుంటారు.
అయితే మొదట వచ్చిన కస్టమర్లకు 10% డిస్కౌంట్ వుండబోతోంది.TSRTC ఆఫీషియల్ వెబ్ సైట్ నుంచి కస్టమర్లు తమ టూర్ బుక్ ప్లాన్ చేసుకోవచ్చు.దీనికి సంబంధించి 040-23450033, 040-69440000 రెండు హెల్ప్ లైన్ నంబర్లను కూడా కాంటాక్ట్ అవ్వొచ్చు.ఈ స్కీమ్ పర్యాటకులకు, సిటీ ప్రజలకు చాలా ఉపయోగపడనుంది.ఆ ధరకు 7 ప్రాంతాల సందర్శన వర్త్ పుల్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.మరి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.