రేపు ఖైరతాబాద్ వినాయకుడికి టీఎస్ గవర్నర్ తొలిపూజ

TS Governor's First Pooja To Lord Ganesha Of Khairatabad Tomorrow

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో దశమహా విద్యాగణపతి భక్తులకు దర్శనమివ్వనున్నారు.ఈ నేపథ్యంలో గణేశునికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలి పూజ చేయనున్నారు.

 Ts Governor's First Pooja To Lord Ganesha Of Khairatabad Tomorrow-TeluguStop.com

ఈ మేరకు రేపు ఉదయం 9.30 గంటలకు గణనాథుడికి తొలి పూజ నిర్వహించనున్నారు.పూజా కార్యక్రమాల్లో గవర్నర్ తమిళిసైతో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొననున్నారని ఉత్సవ కమిటీ తెలిపింది.ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానాలు అందించిందని తెలుస్తోంది.

కాగా ఈ సారి పర్యావరణ హితంగా పూర్తిగా మట్టితో తయారు చేసిన మహా గణపతి 63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.అయితే ఖైరతాబాద్ మహా గణపతి ప్రస్థానం 1954వ సంవత్సరం నుంచి కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube