తెలంగాణా టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీ.
ఆర్.ఎస్ పార్టీలో చేరడం ఖాయమైంది.సీఎం కే.సి.ఆర్ తో ప్రగతిభవన్ లో కలిసి చర్చించారు ఎల్.రమణ.చర్చలు ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎల్.రమణ కే.సి.ఆర్ తనని టీ.ఆర్.ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారని చెప్పారు.దీనిపై తన అనుచరులతో చర్చించాల్సి ఉందని అన్నాఉ.వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.సీఎం కే.సి.ఆర్ తో పలు అంశాలు మాట్లాడానని.సామాజిక తెలంగాణ కోసం కలిసి ముందు వెళ్దామని కే.సి.ఆర్ చెప్పారని రమణ అన్నారు.
రమణతో పాటుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కే.సి.ఆర్ తో చర్చల్లో పాల్గొన్నారు.ఇక ఈ భేటీ అనంతరం ఎర్రబెల్లి కూడా మీడియాతో మాట్లాడారు.
రమణ అంటే కే.సి.ఆర్ కు అభిమానమని.తెలంగాణా టీడీపీ భవిష్యత్ లేదని.
రమణ టీ.ఆర్.ఎస్ లోకి రావాలని కే.సి.ఆర్ ఆహ్వానించగా రమణ సానుకూలంగా స్పందించారని చెప్పారు.చేనేత వర్గం నుండి వచ్చిన ఎల్ రమణ లాంటి వ్యక్తుల అవసరం టీ.ఆర్.ఎస్ కు ఉందని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
త్వరలోనే ఎల్.రమణ టీ.ఆర్.ఎస్ లోకి చేరుతారని చెబుతున్నారు. కే.సి.ఆర్ పిలుపు మేరకే రమణ టీ.ఆర్.ఎస్ లోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది.