తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు ప్రత్యేక ప్రణాళికలతో ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డ సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ముందుగా ప్రకటించదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.
కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఉన్నాయని బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.చాలా మంది సీఎం కావాలని కోరుకుంటారన్న ఆయన దళితుడు సీఎం అనేది పార్టీ ఆలోచిస్తుందని తెలిపారు.
అదేవిధంగా కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభావం ఉంటుందని వెల్లడించారు.