అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే తింగరి నిర్ణయాలు ఎలాంటి పరిస్థితులకి దారిస్తీస్తాయో వేరే చెప్పనవసరం లేదు.తాజాగా ట్రంప్ తనపై కల్పిత రాతలు రాస్తున్నారనే కోపంతో వైట్ హౌస్ కి వచ్చే పత్రికలల్లో కొన్నిటికి చందాలు నిలిపివేశాడు.
ఈ మేరకు వైట్ హౌస్ నుంచీ కీలక ఆదేశాలు విడుదల అయ్యాయి.ప్రభుత్వ ఏర్పాటు తరువాత ఎన్నో సార్లు ప్రభుత్వాన్ని ఎండగడుతూ ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలని తప్పు బట్టిన న్యూయార్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ లపై ఈ నిషేధం విధించారు.
ఇదిలాఉంటే గతంలో కూడా ట్రంప్ మీడియా పై నియంత్రణలు పెట్టిన విషయం విధితమే.వైట్ హౌస్ లో జరిగే మీడియా మిత్రుల సమావేశంలో ట్రంప్ ఎన్నికపై రష్యా జోక్యంపై పదేపదే ప్రశ్నలు అడుగుతున్న జర్నలిస్ట్ ని అతడు పని చేస్తున్న సంస్థ ని వైట్ హౌస్ లోకి రాకుండా బ్యాన్ చేశారు.
ఇదే తరహాలో ఓ మహిళా జర్నలిస్ట్ విషయంలో సైతం వ్యవహరించడంతో ట్రంప్ మీడియా నోరు నొక్కేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే అమెరికాలో అతిపెద్ద వార్తా పత్రికలైన న్యూయార్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ రెండిపై ట్రంప్ మార్క్ రాజకీయం చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయంసం అవుతోంది.అంతేకాదు ట్రంప్ ఈ ఆదేశాలు కేవలం వైట్ హౌస్ కి మాత్రమే పరిమితం చేయకుండా ప్రభుత్వరంగ సంస్థలు అన్నీ చందాలు నిలిపేయమని చెప్పడం అమెరికాలో హాట్ టాపిక్ అవుతోంది.మరి ఈ రెండు పత్రికలూ ఈ విషయంలో ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
.