వైమానిక దాడి తర్వాత పాకిస్తాన్ అవమాన భారంతో భారత్ పై కవ్వింపు చర్యలకి పాల్పడుతుంది.సరిహద్దు వెంబడి కాల్పులకి తెగబడుతూ ఇండియాని రెచ్చగొడుతుంది.
మరో వైపు పాకిస్తాన్ కూడా యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లు పార్లమెంట్ అత్యవసర బేటీకి సిద్ధం అవుతుంది.ఈ నేపధ్యంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ని నేరుగా హెచ్చరికలు చేసారు.
భారత్ పై పాకిస్తాన్ పాల్పడుతున్న కవ్వింపు చర్యలు తక్షణం ఆపాలని, లేదంటే ఇప్పుడున్న పరిస్థితిలో భారత్ ని రెచ్చగొడితే యుద్ధానికి సిద్ధం అయితే పాకిస్తాన్ దారుణ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరికలు జారీ చేసారు.అమెరికా విదేశాంగ మంత్రి కూడా కొద్ది సేపటి క్రితం పాకిస్తాన్ విదేశాంగ మంత్రికి ఫోన్ చేసి కవ్వింపు చర్యలని ఆపాలని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
మరి అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ పై పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి.