ప్రస్తుతం అమెరికా వాసులని వణికిస్తున్న వ్యాధి తట్టు.ఈ వ్యాధి బారిన పడిన ఎంతో మంది ప్రజలు అమెరికా ఆసుపత్రులలో భాదితులుగా మారుతున్నారు.
ఈ వ్యాధి క్రమక్రమంగా పెరగడంతో అమెరికా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.రోజు రోజుకి ఆసుపత్రిలో ఈ భాదితుల సంఖ్య పెరగడంతో ట్రంప్ రంగంలోకి దిగారు.
ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా తట్టు వ్యాధికి టీకాలు వేయించుకోవాలని ట్రంప్ పిలుపునిచ్చారు.ఎవరి బిజీ లో ఎవరు ఉన్నా సరే టీకాలు వేయించుకోవాలని అన్నారు.
అయితే ఈ మధ్య కాలంలోనే దాదాపు 700 కేసులు నమోదైనట్టు ఫెడరల్ హెల్త్ ఆఫీస్ నివేదిక ఇచ్చింది.
న్యూయార్క్, మిచిగాన్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, వాషింగ్టన్ నగరాల్లో ఎక్కువగా ఈ తట్టు వ్యాధి వ్యాప్తిస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు.
ఈ వ్యాధి సోకితే నిమోనియా వ్యాధి వచ్చే అవకాసం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
.