అమెరికాలోకి అక్రమంగా వచ్చే వలసదారులని అడ్డుకోవడానికి ట్రంప్ చేయని ప్రయత్నాలు లేవు.ట్రంప్ ప్రవేశ పెట్టిన జీరో టాలరన్స్ విధానం వలన అమెరికాలో ఎంతో మంది చిన్నారులు తమ తల్లి తండ్రులకి దూరం అయ్యారు.
ఎంతో మంది అభం శుభం తెలియని పిల్లలు అమెరికాలో ప్రవేశించే క్రమంలో మృత్యు వాత పడ్డారు.దాంతో ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ పై నిరశన పెల్లుబికింది.
దాంతో ట్రంప్ కాస్త వెనుకకి తగ్గినట్టుగా కంపించినా తాజా పరిణామాలతో ట్రంప్ నిజస్వరూపం మరో సారి బయట పడింది.
అమెరికాలోకి ప్రవేశించే అక్రమ వలస దారులపై ట్రంప్ మరో సారి తన ప్రతాపాన్ని చూడానికి సిద్దం అయ్యారు.ఈ సారి వారిని అడ్డుకోవడానికి ట్రంప్ క్రూరంగా వ్యవహరించనున్నారు.తాజాగా అధికారులకి ఇచ్చిన ఆదేశాలు చూస్తే అర్థం అవుతుంది.
వలస వాసులని అడ్డుకోవడానికి గోడలకి కరెంటు తీగలని అమర్చాలని ట్రంప్ ఆదేశించారు.అంతేకాదు గోడకి కందకాలు తొవ్వి అందులో మొసళ్ళు , పాములు వదలాలని ట్రంప్ అధికారులకి తెలిపారు.
ఈ విధానం వలన వలస వాసులు అమెరికాలోకి ప్రవేశించే అవకాశాలు అసలు ఉండవనేది ట్రంప్ ఆలోచన.అంతేకాదు ఇప్పటి కూడా ఎంతో మంది వలస వాసులు అమెరికాలోకి ప్రవేసిస్తున్నారని వారిని అడ్డుకోవడంలో మీరు ఎందుకు విఫలం అవుతున్నారని ట్రంప్ అధికారులపై ఫైర్ అయ్యారని స్థానిక మీడియా ఈ కధనాన్ని వెల్లడించింది.అయితే ట్రంప్ తాజాగా ఇచ్చిన ఈ ఆదేశాలపై ఇంటా బయటా విమర్శలు ఎక్కువవుతున్నాయి.
.