అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3 న జరగనున్నాయి.ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడి పెరిగిపోతోంది.
ఎవరి ఎత్తులు వారివి, ఎవరి వ్యుహాలు వారివి అన్నట్టుగా ఒకరి పై ఒకరు విజయం సాధిస్తూ దూసుకుపోతున్నారు.కరోనా సాకు చూపించి ట్రంప్ ని శ్వేత సౌధం నుంచీ బయటకి పంపేలా, ఘోరమైన పరాజయాన్ని చవిచూపించేలా చేయడానికి డెమోక్రటిక్ పార్టీ ముందు నుంచీ విశ్వ ప్రయత్నం చేస్తూ వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ అయ్యిందనే చెప్పాలి…
ట్రంప్ ఓటమి పాలైతే కేవలం కరోనా పాత్ర అత్యంత కీలకం అవుతుందని విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాలని వెల్లడించారు.
కరోనా మహమ్మారి విషయంలో ట్రంప్ అలసత్వం వహించారని ఎక్కువగా డెమోక్రటిక్ పార్టీ ట్రంప్ ని ఫోకస్ చేయడంతో అలెర్ట్ అయిన ట్రంప్ కరోనా కి విరుగుడు మందు కనుగోనేలా ప్రభుత్వ యంత్రాంగానికి నిపుణులకు కీలక ఆదేశాలు ఇవ్వడమే కాకుండా వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి మరీ విజయానికి కొంచం దూరంలో నిలిచాడు.
ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో వ్యాక్సిన్ గనుక అందుబాటులోకి వస్తే విజయం తనదేనని అంచనా వేసిన ట్రంప్ ఆదిశగా వైట్ హౌస్ అధికారులపై ఒత్తిడి తీవ్రంగా పెంచేశాడు.
దాంతో కేవలం నాలుగు వారాల్లోనే సుమారు 10 కోట్ల డోసులు ప్రజలకి అందుబాటులోకి రానున్నాయని ట్రంప్ ప్రకటించారు.ప్రభుత్వం యంత్రాంగం, నిపుణులు , తన కృషి వలన కరోనా విరుగుడు వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వస్తుందని విమర్శకుల నోళ్ళు మూతబడుతాయని ట్రంప్ ప్రకటించారు.