అమెరికాలో ఉంటున్న భారత సంతతి వ్యక్తులు ఎంతో మంది అమెరికా ప్రభుత్వంలో కీలక పదవుల్లో కొలువుదీరుతున్నారు.ట్రంప్ గత సంవత్సర కాలంగా ఎంతో మంది భారతీయులకి కీలక పదవులు అప్పగించారు.
ఈ క్రమంలోనే తాజాగా మరొక ప్రవాస భారతీయుడు సంపత్ శివంగి కి ట్రంప్ కీలక పదవిని అప్పగించారు.ఈ మేరకు ఆదేశాలు కూడా జారీఅయ్యాయి.
అమెరికా నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ లోకి సంపత్ ని తీసుకుంటున్నట్టుగా అమెరికా హెల్త్ ,హ్యూమన్ సర్వీసెస్ సేక్రటరీ అలెక్స్ తెలిపారు.ఇందులో సంపత్ సేవలని కూడా వినియోగించుకోనున్నారు.తనని
నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ లోకి తీసుకోవడం పట్ల ట్రంప్ కి సంపత్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలాఉంటే సంపత్ తన వైద్య వృత్తిలో కొనసాగుతూనే మిసిసిపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ మెటల్ హెల్త్ కి చైర్మెన్ గా వ్యవహరించారు.అంతేకాదు జార్జ్ బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ హ్యూమన్ సర్వీసెస్ కి అడ్వైజర్ గా సేవలు అందించారు.ఎన్నో కీలక పదవుల్లో ఉన్నతమైన సేవలు అందించిన సంపత్ కి 2017 లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ అనే అవార్డ్ ని సైతం ప్రకటించారు.
అంతేకాదు రిపబ్లికన్ పార్టీకి సేవకుడిగా ఎన్నో ఏళ్ళుగా ఉంటున్నారు.