అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లో ఓ శునకానికి ఆతిద్యం ఇచ్చారు.కనీ వినీ ఎరుగని రీతిలో ఆ శునకానికి రాచమర్యాదలతో వైట్ హౌస్ లోకి ఆహ్వానించారు.
అంతేకాదు ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ కోనాన్ అని పిలువబడే ఈ శునకం వైట్ హౌస్ లోకి రావడం నాకు ఎంతో గౌరవంగా ఉందంటూ ట్వీట్ చేశారు.శునకానికి ఆతిద్యం ఇచ్చే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు, ట్రంప్ భార్య మెలానియా కూడా ఉన్నారు.
శునకానికి ట్రంప్ ఆతిధ్యం ఇవ్వడం ఏమిటి.??? వైట్ హౌస్ లో కి ఆ శునకం అడుగు పెడితే ట్రంప్ కి ఎందుకు గౌరవం అనుకుంటున్నారా.అసలు విషయం ఏమిటంటే.
ఐసీఎస్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీ ని హతమార్చడంలో కీలక పాత్ర పోషించిన ప్రపంచంలోనే అత్యంత మేలు జాతి శునకం అయిన బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన కొనాన్ అనే శునకం వైట్ హౌస్ చేరుకుంది.
ఓ గుహలో దాగున్న బాగ్దాదీ ని వెంట పడి తరుముతూ పరుగులు పెట్టించిన ఆ శునకం చివరికి బాగ్దాదీ ని ఆ గుహ చివరి వరకూ తీసుకు వెళ్ళింది.ఎక్కడ ఈ శునకం వలన తానూ అమెరికా సైన్యానికి దొరికి పోతానో అని భయపడిన బాగ్దాదీ.
తనని తానుగా కాల్చుకుని మరణించాడు.అత్యంత దుర్భర స్థితిలో మరణించిన అతడిని అమెరికా సైనికులు కనుగొని టార్గెట్ పూర్తి చేశారు.ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించిన శునకం కొనాన్ కి తీవ్ర గాయాలు అయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని ఇచ్చే గౌరవ ఆతిద్యం తీసుకోవడానికి వైట్ హౌస్ వచ్చిన కొనాన్ తో ట్రంప్ సంతోషంగా గడిపారు.