అదేంటో మరి.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడిన జనాలను ఆశ్చర్యపరుస్తుంటుంది.
ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ట్రంప్ మాట్లాడిన ఓ మాటా నెట్టింట వైరల్ అవుతుంది.అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట హాల్ చల్ అవుతున్నాయ్.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.మొదటి ప్రపంచ యుద్ధంలో వీరమరణం పొందిన అమెరికా నౌకాదళ సైనికులను ఫ్రాన్స్లోని డబ్ల్యూడబ్ల్యూఐ స్మశానవాటికలో ఖననం చేశారు.అయితే ఆ సమాధులను చూసేందుకు ట్రాంప్ ఏమాత్రం ఇష్టపడలేదట.అది మాత్రమే కాదు ఓడిపోయినా వారు పిరికి పందలు అని.వారిని అతను చూడనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడట.
ఇక దీనికి సంబంధించి అట్లాంటిక్ పత్రిక నిన్న ఒక నివేదిక వెల్లడించింది.
ఇక మ్యాగజైన్ ఎడిటర్-ఇన్-చీఫ్ జెఫ్రీ గోల్డ్బెర్గ్ నివేదిక ప్రకారం 2018లో పారిస్ సమీపంలోని ఐస్నే-మార్న్ అమెరికన్ స్మశానవాటికను సందర్శించేందుకు ట్రంప్ నిరాకరించినట్టు, దానికి కారణం అతని జుట్టు వర్షంలో తడిచిపోతుందనే భయంతో ఆలా చేసినట్టు అందులో ఉంది.
అయితే ఈ విషయంపై ట్రంప్ సహాయకులు స్పందిస్తూ.”వాతావరణం బాగాలేదని అందుకే హెలికాప్టర్ అక్కడికి వెళ్లలేదని” అయన తెలిపారు.ఏది ఏమైనప్పటికి ట్రంప్ కు నోటి దురుసు అనే విషయాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే.
నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి నెట్టింట వైరల్ అవుతుంటారు.