అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.జార్జ్ ఫ్లాయిడ్ హత్య తరువాత అమెరికా అట్టుడికి పోయింది.
వేలాది మంది నిరసన కారులు అమెరికా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో చేపట్టిన నిరసనలు ప్రజలకి తెలియంది కాదు.వారికి అడ్డు వచ్చిన ప్రతీ వస్తువుని నేల మట్టం చేశారు.
భవనాలు, రెస్టారెంట్లు, పార్కులు, పురాతన చర్చిలు, విగ్రహాలు ఇలా ప్రతీ ఒక్కటిని వారు ద్వంసం చేశారు.
అంతకు ముందు వైట్ హౌస్ ముందు నిరసనలు చేపట్టిన క్రమంలోనే నిరసన కారులు అమెరికా మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
అంతేకాదు కొలంబస్ విగ్రహాలు, గాంధీ విగ్రహాలని నేల మట్టం చేశారు.భారతీయ రెస్టారెంట్లు ధ్వంసం చేసిన నిరసన కారులు పలు చరిత్ర కారుల విగ్రహాలని సైతం శిధిలం చేశారు.
ఇదిలాఉంటే ఈ సంఘటనలపై గతంలోనే ట్రంప్ స్పందించారు.దేశంలో స్మారక చిహ్నాలు, విగ్రహాలని ధ్వంసం చేసేవారిపై కటిన మైన చర్యలు తీసుకునేలా చట్టం తీసుకువస్తామని అన్నారు.
ఈ సందర్భంలోనే…
అమెరికా వ్యాప్తంగా పురాతన కట్టడాలు, విగ్రహాలని ధ్వంసం చేసే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.వారిపై జాలి చూపద్దని, ఎలాంటి వారైనా కటినమైన చర్యలు తీసుకుని శిక్షలు విధించామని ఆదేశాలు జారీ చేశారు.
ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ ఈ చర్యలు తీసుకోవడానికి నేను ఎంతో వేచి చూస్తున్నాను.ఈ విషయాని ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.