కొత్త వాహన చట్టాలు అధికారంలోకి వచ్చిన తరువాత వాహనాలతో బయటకు రావాలి అంటేనే ప్రజలు భయపడుతున్నారు.ఎప్పుడు ఏ పేరు తో ఫైన్ విధిస్తారో అంటూ అందరూ బిక్కు బిక్కు మంటూ రోడ్లపైకి వస్తున్నారు.
మొన్నటికి మొన్న బైక్ పత్రాలు లేవని ఫైన్ విధించడం తో అతడు ఏకంగా బైక్ నే తగలబెట్టుకున్న ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా ఒక లారీ డ్రైవర్ కు 2 లక్షల రూపాయల మేరకు భారీ ఫైన్ విధించడం విశేషం.
దీనితో దేశంలో ఇప్పటివరకూ పడిన అత్యధిక ఛలానాగా ఈ మొత్తం రికార్డుల్లోకి ఎక్కింది.అంతేనా.
ఈ లారీ డ్రైవర్ రామ్ కిషన్ ను అరెస్ట్ కూడా చేశారు పోలీసులు.అయితే ఇంతకీ ఇంత భారీ మొత్తంలో ఫైన్ ఎందుకు విధించారు అంటే పరిమితికి మించిన సామాన్లను లారీలో తీసుకెళ్లటం వల్ల ఇంత భారీ మొత్తంలో ఫైన్ విధించినట్లు తెలుస్తుంది.
లారీలో నిర్దేశించిన బరువుకు మించి సామాన్లను తీసుకెళితే ప్రతి అదనపు టన్నుకు రూ.2వేలు జరిమానా విధించాల్సి వస్తుంది.ఈ లెక్కన రూ.2.05 లక్షల చలానా విధించారు.దీనిని బట్టి నిబంధనల ఉల్లంఘన ఎంత భారీగా ఉందొ అన్న విషయం అర్ధం అవుతుంది.