మునుగోడులో టీఆర్ఎస్దే విజయమని ఎమ్మెల్సీ కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ లో పాల్గొని మొక్కలు నాటారు.
టీఆర్ఎస్ పార్టీకి నల్గొండ జిల్లా కంచుకోటగా ఉందని వ్యాఖ్యనించారు.హుజుర్ నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించినట్లుగానే మునుగోడులోనూ విజయదుంధుబి మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.దేశ వ్యాప్తంగా రాష్ట్ర గౌరవాన్ని నిలబెడుతున్న సీఎం కేసీఆర్ కు ప్రజలెప్పుడూ అండగా ఉంటారని పేర్కొన్నారు.
అనంతరం దేశ రాజకీయాలను ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారని.ఒంటెద్దు పోకడలు మంచిది కాదన్నారు.
బీజేపీని ప్రజలు నమ్మే స్థితిలో ఎవరూ లేరని ఎద్దేవా చేశారు.రానున్న మునుగోడు ఉప ఎన్నికే సరైన సమాధానం చెప్తుందని స్పష్టం చేశారు.