నేడు జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది అంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.తప్పకుండా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కే స్థానిక ఓటర్లు పట్టం కట్టారని ఆయన అన్నాడు.
ఓటింగ్ ప్రశాంతంగా ముగియడంతో పాటు, మంచి ఓటింగ్ పర్సంటేజ్ నమోదు అవ్వడం పట్ల కూడా కేటీఆర్ ఆనందంను వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ స్పందిస్తూ.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకు మరియు నాయకులకు కృతజ్ఞతలు.నాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మా క్యాండెంట్ శానంపూడి సైదిరెడ్డి గెలుపొందబోతున్నాడు.
ఆయన గెలుపుతో తమ సత్తా చాటబోతున్నట్లుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ప్రకటించాడు.ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు కూడా చాలా ధీమాగా కనిపిస్తున్నారు.
మరి ఫలితం ఏంటీ అనేది చూడాలి.