నిన్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలవడంతో ఆ పార్టీలో నూతనోత్సాహం నెలకొన్న సంగతి తెలిసిందే.దుబ్బాక ఉప ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
దీంతో తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన టిఆర్ఎస్ .నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో కూడా .ఆ స్పీడ్ కొనసాగిస్తూ రావటం జరిగింది.ఇప్పుడిదే స్పీడ్ ఖమ్మం మున్సిపల్ ఎన్నికలలో కారు జోరు కొనసాగుతోంది.
తాజాగా జడ్చర్ల మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.మొత్తం 27 వార్డుల్లో 16 గెలిచిన టిఆర్ఎస్.
ఇంకా తన సత్తా చాటుతోంది.ఖమ్మం మున్సిపోల్స్ లో సిపిఐ పార్టీతో టిఆర్ఎస్ కూటమిగా ఏర్పడి.
విజయపథంలో నడుస్తోంది.ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ – సిపిఎం బరిలోకి దిగిన గాని టిఆర్ఎస్ కూటమికి .ఖమ్మం వాసులు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి.దీంతో తాజా ఫలితాలు బట్టి చూస్తే ఏమాత్రం డౌట్ లేకుండా ఖమ్మం మున్సిపాలిటీ టిఆర్ఎస్ దే అని అంటున్నారు విశ్లేషకులు.
.