తెలంగాణ వచ్చిన మొదట్లో టీఆర్ ఎస్కు తిరుగే లేదని అంతా భావించారు.ఇక భవిష్యత్ అంతా కూడా టీఆర్ ఎస్దేనని రాజకీయ విశ్లేషకులు వెల్లడించారు.
కాగా మొదటి సారి సీఎం అయిన కేసీఆర్ తన ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్, టీడీపీలను దారుణంగా బలహీన పరిచారు.అందులో ఉన్న కీలక నేతలందరినీ తన పార్టీలో చేర్చుకుని ఆ పార్టీలకు పట్టులేకుండా చేసేశారు.
ఇక ఆయనకు మొదటి ప్రభుత్వ హయాంలో ఉన్నంత హవా ఇప్పుడు లేదనే చెప్పాలి.ఎందుకంటే ఆ సమయంలో కేసీఆర్ సెట్ చేసిన ట్రెండ్లో ప్రతిపక్ష కాంగ్రెస్ ఉండేది.
కానీ ఎప్పుడైతే 2019లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయో అప్పుడే సీన్ మారిపోయింది.అనూహ్యంగా బీజేపీ నుంచి నలుగురు ఎంపీలుగా గెలవడంతో టీఆర్ ఎస్ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది.
ఇక అప్పటి నుంచి అన్ని పనుల్లోనూ టీఆర్ ఎస్కు బీజేపీ పెద్ద సవాల్ గా మారింది.గత చరిత్రలో ఎన్నడూ లేనంతగా కాషాయ పార్టీ పుంజుకుంది.అనూహ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బలపడిపోయింది.ఇక కాంగ్రెస్ కాకుండా తామే టీఆర్ ఎస్ కు ప్రతిపక్ష మంటూ చెప్పే స్థాయికి ఎదిగింది.
ఇంకా చెప్పాలంటే బండి సంజయ్ ఓ అడుగు ముందుకేసి రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పేస్తున్నారు.
ఇక్కడే కేసీఆర్ ప్లాన్ చేంజ్ చేశారు.ఇలా అయితే లాభం లేదనుకుని కాంగ్రెస్కు కొత్తగా బాస్ అయిన రేవంత్ మీద ఫోకస్ పెంచేశారు టీఆర్ ఎస్ బాస్.ఎందుకంటే రెండు పార్టీలు ప్రతిపక్షంగా ఉంటే అది అధికార పక్షానికి మేలు చేస్తుందని టీఆర్ ఎస్ భావిస్తోంది.
రెండు విధాలుగా ఓట్లు చీలిపోయినా చివరకు తమకే లాభం జరుగుతుందని అందుకే రేవంత్పై విమర్శలు ఎక్కుపెడుతన్నారు.టీఆర్ ఎస్ నేతలందరికీ కూడా ఇప్పటికే ఈ విషయంలో సూచనలు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది.
మొత్తానికి బీజేపీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ రేవంత్పై ఫోకస్ పెట్టారన్నమాట.