ఆంధ్రోళ్ళు తినేది పేడ బిర్యానీ అంటూ నిన్నటి వరకూ తిట్టినా కెసిఆర్ ఇప్పుడు ఆంధ్రా వాళ్ళ బిర్యానీ అదుర్స్ అంటూ కొత్త భాష్యం చెబుతున్నారు.గ్రేటర్ ఎన్నికల పుణ్యమా అని ఎన్నడూ లేని ‘ ఆంధ్రా’ ప్రేమ చూపిస్తున్నారు కెసిఆర్.
తెలంగాణా వారికి వారాల జల్లు కలిపిస్తూనే అక్కడ ఉన్న ఆంధ్రోళ్లు కూడా తెలంగాణా వారే అని తేల్చేస్తున్నారు ఆయన.మొన్నటి దాకా ఏపీ జనాలని తరిమి తరిమి కొడతాం అన్న నోటితోనే ఏపీ లో కూడా పోటీ చేస్తాం అనీ తెరాస పార్టీ పేరు తెలుగు రాష్ట్ర సమితి గా మార్చుతాం అనీ చెప్పుకొస్తున్నారు.
హైదరాబాద్ మీద మొన్నటి వరకూ మోజు కోల్పోయిన తెలుగోళ్ళు కెసిఆర్ మాటలకి పడిపోయినట్టు అనిపిస్తోంది.హైద్రాబాద్ ప్రైవేటు ఉద్యోగాలకి కేరాఫ్ అడ్రస్.ఇలా అనేక కారణాలు, ఆంధ్రాలో తెలంగాణ ముఖ్యమంత్రి పట్ల సానుకూలత కాస్తో కూస్తో పెంచేలా చేస్తున్నాయి.చంద్రబాబు మీద ఉన్న అసంతృప్తి కూడా దీనికి కారణం కావచ్చు, కెసిఆర్ కి మద్దతుగా ఏపీ లో ఫ్లెక్సీ లు పెట్టడం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది.
భవిష్యత్తు లో తెరాస కూడా ఏపీ లో విస్తరిస్తుంది అని కేటీఆర్ అన్న మాటలే ఫ్యూచర్ లో నిజమయ్యేలాగా కనిపిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే.
ఏమో, కేసీఆర్ పార్టీ గెలిచినా గెలవకపోయినా ఉనికి చాటుకునే అవకాశాలైతే లేకపోలేదన్పించకమానదు.