బ్రేకింగ్.. న్యాయవాది దంపతుల హత్య కేసులో.. కుంట శ్రీనువాస్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేసిన టీఆర్ఎస్.. ?

తెలంగాణా రాష్ట్రంలో నిన్న పట్టపగలే నడి రోడ్డు మీద న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణిలను దారుణంగా హత్యచేసిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.అయితే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.

 Trs Suspends Kunta Srinivas From Party, Trs Suspend, Kunta Srinivas, Lawyer Coup-TeluguStop.com

కాగా దంపతులను హత్య చేసి పారిపోయిన నిందితులను పోలీసులు సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారట.

ఇకపోతే వామన్ రావు దంపతులను హత్య చేసింది కుంట శ్రీనివాస్ తో పాటు మంథని మండలం విలోచన పురం కు చెందిన చిరంజీవిగా గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ రోజు రాత్రి 8 గంటలకు నిందితులను మీడియా ఎదుట హాజరు పరుచనున్నట్లుగా తెలుస్తుంది.

ఇదిలా ఉండగా మంథని మండల గుంజపడుగు గ్రామంలో కొనసాగుతున్న పెద్దమ్మ ఆలయ నిర్మాణం విషయంలో వామనరావు, శ్రీనుకు మధ్య తలెత్తిన వివాదాలే గట్టు దంపతుల హత్యకు దారి తీసినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే టీఆర్ఎస్ నాయకునిగా ఉన్న కుంట శ్రీనివాస్ ను ఆ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం వెల్లడించింది.ఇక ఈ కేసులో ముఖ్యమైన వ్యక్తిగా కుంట శ్రీనివాస్ ఉన్న విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube