హుజురాబాద్ ఉప ఎన్నిక విషయం టీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున మేధో మధనంజరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇటు ఎల్.
రమణ ను ముందు బరిలోకి దించుదామని టీఆర్ఎస్ అధిష్టానం భావించినా ఒక్క సారిగా కౌశిక్ రెడ్డి యూ టర్న్ తో ఒక్కసారిగా టీఆర్ఎస్ మేధోమధనంలో పడిందని చెప్పవచ్చు.అయితే ఈటెల తరువాత అక్కడ బలంగా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కౌశిక్ రెడ్డి మాత్రమే.
కావున ఇప్పుడు హుజురాబాద్ కారు డ్రైవర్ ఎవరనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
హుజూరాబాద్ ఎన్నికపై రేవంత్ పెద్దగా ఆసక్తి కనబరచకపోవడంతో అక్కడ ఈటెల కు ప్రత్యర్థిగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడంతో , అంతేకాక టీటీడీపీ తెలంగాణ మాజీ అధ్యక్షులు ఎల్.రమణ సైతం టీఆర్ఎస్ లోకి రావడంతో టికెట్ వీరిరువురిలో ఎవరికి ఇస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.అయితే కౌశిక్ రెడ్డి ఓసీ నేత కావడంతో, బీసీ నేత అయిన ఈటెల రాజేందర్ పై పోటీకి దింపితే పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై టీఆర్ఎస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ వీడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.