తెలంగాణాలో పోలింగ్ తేదీ దగ్గరకు వస్తున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీ కి కొత్త తలపోట్లు ఎక్కువయ్యాయి.పార్టీ తరపున అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ కొంతమంది నాయకులు రెబెల్స్ గా బరిలోకి దిగి పెద్ద తలనొప్పిగా మారారు.
వీరిని బుజ్జగించేందుకు పార్టీలోని కొంతమంది కీలక నాయకులు రంగంలోకి దిగి నచ్చచెప్పినా… ససేమీరా అంటూ బరిలో నిలిచి ప్రచారం చేసుకోవడంతో ఆగ్రహించిన అధిష్టానం వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
మాజీ మంత్రి జి.వినోద్, గజ్జల నగేష్, జలంధర్ రెడ్డి, శంకర్ని అధిష్టానం సస్పెండ్ చేసింది.సస్పెండ్ అయిన వారిలో గడ్డం వినోద్ బెల్లంపల్లి నుంచి బీఎస్పీ అభ్యర్దిగా బరిలో ఉంటే.
గజ్జల నగేష్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి రెబల్గా పోటీ చేస్తున్నారు.ఇక జలంధర్ రెడ్డి మక్తల్ నుంచి, శంకర్… షాద్ నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.