తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికలకి ఇప్పటికే సర్వం సన్నద్ధం చేసుకుంది.రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ స్థానాలలో టీఆర్ఎస్ విజయం సాధించాలనే లక్ష్యంగా ఆ పార్టీ పని చేస్తుంది.
దీనికి తగ్గట్లుగానే కేసిఆర్ ఎన్నికల ప్రచారంలో తనదైన పంథాలో దూసుకుపోతున్నారు.ఇంకా అభ్యర్ధుల ఖరారు చేయకుండానే అన్ని పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తూ ప్రజలకి తన బాణీని వినిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్ధుల జాబితాని కేసీఆర్ ఈ రోజు ప్రకటించడానికి అవుతున్నారు.ఈ అభ్యర్ధుల జాబితాలో ఎక్కువగా కొత్తవారికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నవారిలో కొందరిని తప్పించి ఆ స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.అలాగే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిన సబితా తనయుడు కార్తిక్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.