తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి.ప్రధానంగా ఉన్న మూడు పార్టీల మధ్య జరుగుతున్న పోరు చూస్తుంటే రాజకీయమత్తు సోకితే ఇలాగే ఉంటుందా అనిపిస్తుంది.
ఈరోజుతో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపధ్యంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి గాంధీభవన్లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.
తెలంగాణాలో టీఆర్ఎస్ పరిస్దితి చివరికి మాజీ ప్రధాని పీవీ బొమ్మ పెట్టుకుని ఓట్లు అడుక్కునే వరకు వచ్చిందని, ఎన్నికల్లో ఓడి పోతామనే భయంతో పీవీ ఫోటోతో ఓట్లు అడుగుతున్నారని మల్లు రవి మండిపడ్డారు.
కాగా టీఆర్ఎస్ నేతలు ప్రచారంలో పీవీని గుర్తు చేయడంతో కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుందని, పీవీ బొమ్మ పెట్టి ప్రచారం చేసి కాంగ్రెస్కు ఉచిత ప్రచారం ఇస్తున్నారన్నారని వెల్లడించారు.
కారు ఎన్ని జిమ్ముక్కులు చేసిన, పీవీ అభిమానులు మాత్రం కాంగ్రెస్ వైపే ఉంటారని మల్లు రవి పేర్కొన్నారు.
ఇక టీఆర్ఎస్ ఏడేళ్ల కాలంలో ఏ ఒక్క ప్రజా సంక్షేమ, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కాబట్టే దిగజారుడు రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు.