హైదరాబాద్: తెరాస వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సంబురాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం తెరాస జెండాను ఆవిష్కరించారు.మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 40 అడుగుల జెండాను కేటీఆర్ ఎగురవేశారు.ఆ తర్వాత తెరాస ఆవిర్భావ దినోత్సవ కేక్ కట్ చేశారు.పాటలు, బాణసంచా చప్పుళ్లతో తెలంగాణ భవన్ ప్రాంగణం కోలాహలంగా మారింది.