ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలలో సైబర్ నేరగాళ్ళు సామాన్యులే లక్ష్యంగా సైబర్ దోపిడీకి పాల్పడటం మనం చూస్తూనే వున్నాం.ఏదో లాటరీ వచ్చింది అని చెప్పి, డబ్బులు వసూలు చేయడం, అలాగే ప్రభుత్వం పథకాలు పేరుతో డబ్బులు దొబ్బెయడం చేస్తూ వుంటారు.
అలాంటి నేరాలకి కేరాఫ్ అడ్రెస్ గా హైదరాబాద్ మారింది.ఎక్కువగా ఈ సైబర్ నేరాలకి పాల్పడే వారు విదేశీయులే వుంటారు.
ఇదిలా వుంటే తాజాగా హైదరాబాద్ లో టీఆర్ఎస్ కి చెందిన ముఠా గోపాల్ అనే ఎమ్మెల్యే కుమారుడు జయసింహని కూడా ఓ సైబర్ నేరగాడి ఉచ్చులో పడ్డాడు.ఉపాధి హామీ పథకం క్రిధం రుణాలు ఇప్పిస్తానని చెప్పిన సైబర్ నేరగాడు వారంలో 25 లక్షలు వస్తుందని అతన్ని నమ్మించాడు.
అయితే దానికి ప్రోససింగ్ ఫీజ్ క్రింద 5 శాతం చెల్లించాలని చెప్పడు.దాంతో జయసింహ రెండున్నర లక్షలు సైబర్ నేరగాడి ఖాతాలో వేసాడు.ఇక ఆ డబ్బులు జమ చేసిన తర్వాత అతని ఫోన్ పనిచేయక పోవడంతో జయసింహ పోలీసులని ఆశ్రయించాడు.