దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణ వార్త పలువురు తీవ్ర దిగ్ర్భాంతి లోనయ్యారు.సీఎం కేసీఆర్ స్పందించి ఎమ్మెల్యే మరణంపై సంతాపం వ్యక్తం చేశాడు.
టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, నాయకులు ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు.
దబ్బాక ఎమ్మెల్యే మరణవార్త విని సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భాంతికి గురయ్యాడు.
ఆయన మాట్లాడుతూ.‘‘ఎమ్మెల్యే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.
ఓ మంచి నాయకుడిని కోల్పోయాం.తెలంగాణ ఉద్యమ సమయంలో తను సహచరుడు.
మా ఇద్దరిది ఒకే ప్రాంతం.తను ఎంతో ఆత్మీయతకు కలిగి ఉండే వాడు.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తా’’ అంటూ సంతాపం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఓ ఉద్యమకారుడిగా, జర్నలిస్టుగా, శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా పదవులు చేపట్టారు.
ఆయన అకాల మరణం నన్ను కలచి వేసింది అంటూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఎమ్మెల్యే మృతి తెలంగాణకు తీరని లోటని, వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం అని తెలిపారు.మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దిగ్భాంతి వ్యక్తం చేశారు.దుబ్బాక నియోజకవర్గంలో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నిరాడంబరుడని కొనియాడారు.