ఖబడ్దార్ తొండి సంజయ్

గ్రేటర్ వరంగలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి.ఈ నేపథ్యంలో తెలంగాణ బి‌జే‌పి అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్ పర్యటనలో కే‌సి‌ఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చెయ్యడంతో అధికార పార్టీ నుండి కౌంటర్ ఏటాక్ లు మొదలయ్యాయి.

 Trs Mla Dasyam Vinay Baskar Serious Warning To Bandi Sanjay, Warangal Elections,-TeluguStop.com

టి‌ఆర్‌ఎస్ ఎం‌ఎల్‌ఏ దాస్యం వినయ్ భాస్కర్ బండి సంజయ్ పై నిప్పులు చెరిగాడు.టి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ ని విమర్శిస్తే నాలుక కోస్తా బిడ్డా అంటూ హెచ్చరించాడు.

బండి సంజయ్ ను తొండి సంజయ్ అంటూ ఎద్దేవా చేశాడు. బండి సంజయ్ కి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఛార్మినార్ భద్రఖాళీ ఆలయం గుర్తుకు వస్తాయి అన్నాడు.

వరంగల్ వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు బి‌జే‌పి నేతలు అంత ఎటువెళ్లారు అంటూ ప్రశ్నించాడు.

Telugu Bandi Sanjay, Dasyamvinay, Telangana, Warangal-Political

మా అధినేత ఆజ్ఞామేరకు వరద భాధితులను ఆదుకున్నాం మని అన్నాడు.కేంద్ర ప్రభుత్వం వరంగల్ కు చేసింది ఏమి లేదని కొన్ని ఏండ్ల చరిత్ర వరంగల్ కు ఉంది కాబట్టే హేరిటేజ్ సిటీ గా గుర్తింపు వచ్చిందని అన్నాడు. గల్లీ స్థాయి నుండి డిల్లీ స్థాయి కి వెళ్ళిన బండి సంజయ్ రాష్ట్రనికి ఏమి తీసుకువచ్చాడని ప్రశ్నించాడు.

తెలంగాణ కోసం కే‌సి‌ఆర్ ప్రాణ త్యాగానికి సిద్దపడ్డాడని టి‌ఆర్‌ఎస్ నేతలంతా ఉద్యమాలు చెయ్యడం వల్లే తెలంగాణ వచ్చిందని అన్నాడు.అప్పుడు బి‌జే‌పి నేతలు అంతా ఎక్కడికి పోయారని అన్నాడు.

బండి సంజయ్ నోటికి వచ్చిన పిచ్చి పిచ్చి కూతలు కుయోద్దు అని హితవు పలికాడు.తెలంగాణ కోసం పోరాడిన జయశంకర్ సమాధి స్థలాని బి‌జే‌పి నేతలు వివాదం చేస్తున్నారని మండి పడ్డాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube