ఓడిన ఇద్దరు మంత్రులు !

తెలంగాణాలో తిరుగులేరని ఆధిక్యంతో ముందుకు వెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ కి చిన్నపాటి ఎదురుదెబ్బ తగిలింది.ఆ పార్టీలో తిరులేని అధికారం చెలాయించిన ఇద్దరు మంత్రులు ఓటమిపాలవ్వడం ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 Trs Ministers Tummala Nageswarao Krihnarao Lost Their Election-TeluguStop.com

ఆ ఇద్దరిలో ఒకరు తుమ్మల నాగేశ్వరరావు, మరొకరు జూపల్లి కృష్ణారావు.ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తుమ్మల.

కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.ఇక్కడ ఉపేందర్ రెడ్డి 1980 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

అలాగే… మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జూపల్లి కృష్ణారావు కూడా ఓటమి పాలయ్యారు.తన సమీప ప్రత్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిపై దాదాపు మూడువేల ఓట్ల తేడాతో ఓటమి పాలవ్వడం ఆ పార్టీ అగ్ర నాయకులను షాక్ కి గురిచేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube