ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు రచ్చరచ్చగా ఉన్నాయి.వరుస పరిణామాలతో రాజకీయ పార్టీలు జోరుమీదున్నాయి.
ఇప్పటికే సంచలనమైన ఈటల రాజేందర్ ఈరోజు బీజేపీలో చేరడంతో మరింత కీలకంగా మారాయి రాజకీయాలు.అయితే ఈటల వ్యవహారం బయటకు వచ్చినప్ప్పటి నుంచే టీఆర్ ఎస్లో కల్లోలం మొదలైంది.
తర్వాత ఎవరు అంటూ ఊహాగానాలు తెరమీదదకు వచ్చాయి.ఇక మొన్న రేవంత్ ట్వీట్ టీర్ ఎస్లో పెద్ద దుమారమే రేపింది.
కర్నాటకలోని హంపిలో జరిగిన బర్త్డే పార్టీ వ్యవహారం తెలంగాణ టీఆర్ ఎస్ నేతలను కుదిపేసింది.దీంతో నెక్ట్స్ మంత్రి జగదీశ్రెడ్డి అంటూ వార్తా కథనాలు కూడా వచ్చాయి.
ఆయనపై త్వరలోనే వేటు పడుతుందని అంతా అనుకున్నారు.దీంతో టీఆర్ ఎస్ నేతల్లో నెగెటివ్ టాక్ ఉన్న వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టకుని మరీ జరిగేది చూడసాగారు.
ఇక వీటిపై ఇప్పటి వరకు స్పందించని జగదీశ్రెడ్డి ఈ రోజు తాజాగా వీటిపై స్పందించారు.తనపై వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు.
హంపి కథ అంతా కొందరి స్క్రిప్టు మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు.తనపై వేటు పడుతుందనే వార్తలు పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు.తనకు ఈటల లాంటి గతి పట్టదంటూ తెలిపారు.తాను కేసీఆర్కు అత్యంత నమ్మకస్తుడినని రేవంత్ లాంటి వ్యక్తులు చేసే ట్వీట్లకు విలువ లేదంటూ తెలిపారు.ఇక బీజేపీలో ఈటల చేరడంపై హాట్ కామెంట్లు చేశారు.బీజేపీ మునిగిపోయే పడవ అని, అందులో చేరితో ఎలాంటి లాభం లేదని వివరించారు.
ఈటల చేసిన తప్పులకు ప్రజలే బుద్ధి చెప్తారని వెల్లడించారు.దీంతో మంత్రి తనపై వస్తున్న వార్తలకు పులిస్టాప్ పెట్టేసినట్టు తెలుస్తోంది.
కాగా ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేదనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.ఏదేమైనా ఈటలపై ఒక్కొక్కరుగా కామెంట్లు చేస్తున్నారు.