శ్రీహరిని మించిపోయిన పసునూరి

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో కనీ వినీ ఎరుగని గులాబీ పార్టీ విజయాన్ని ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా ఊహించి ఉండరు.గత ఎన్నికల్లో కడియం శ్రీహరిని మించిన బంపర్ మెజారిటీతో పసునూరి దయాకర్ గెలిచారు.

 Bumper Majority…..super Victory-TeluguStop.com

శ్రీహరి కంటే దాదాపు లక్ష ఓట్ల మెజారిటీ ఎక్కువ వచ్చింది.శ్రీహరి 3 లక్షలకు పైగా మెజారిటీ సాధిస్తే పసునూరి దయాకర్ 4 లక్షలకు పైగా మెజారిటీ సాధించారు.

నిజానికి ఈ విజయం పసునూరిది కాదు.ముఖ్యమంత్రి కెసీఆర్ సాధించిన విజయమే.

గులాబీ పార్టీ గెలుస్తుందని అందరూ ఊహించిన సంగతే.కానీ ఇంత సూపర్ డూపర్ మెజారిటీ వస్తుందని అధికార పార్టీ నాయకులు కూడా ఊహించలేదు.

గత ఎన్నికల్లో మాదిరిగానే కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది.బీజేపీ -టీడీపీ కూటమి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.

ఇంత ఘన విజయం గులాబీ పార్టీకి ఎలా సాధ్యం అయిందో ప్రతిపక్ష పార్టీలకే కాదు, రాజకీయ విశ్లేషకులకు కూడా అర్ధం కావడం లేదు.ప్రజల్లో కెసీఆర్ పాలన మీద బాగా వ్యతిరేకత ఉందని ఒక వర్గం మీడియాలో ప్రచారం జరిగింది.

వ్యతిరేకత ఉంటే ఇంత బంపర్ మెజారిటీ సాధ్యం కాదు.ఈ గెలుపు ఏం తెలియ చేస్తున్నది? కెసీఆర్ పరిపాలన బాగుందని ప్రజలు మెచ్చుకున్నారా? తెలంగాణా సెంటిమెంటు బలంగా పని చేసిందా ? లేదా పసునూరి స్తానికుడనే అభిమానం ఎక్కువ పని చేసిందా? లేక అన్ని కలిపి ప్రజల మీద ప్రభావం చూపించాయా? ఒక్కటి మాత్రం వాస్తవం.ప్రజలకు కెసీఆర్ మీద ఇంకా నమ్మకం, ప్రేమ, అభిమానం ఉందని రుజువు అయింది.ఈ అఖండమైన గెలుపుతో కేసీఆర్కు అహంకారం మరింత పెరుగుతుందా? తనకు ఎదురు లేదని అనుకుంటారా? ఏది ఏమైనా ఒక కళాకారుడు పార్లమెంటుకు వెళ్ళడం సంతోషమే.తెలంగాణా తల్లి విగ్రహం తయారు చేసిన కళాకారుడికి కెసీఆర్ మంచి బహుమతి ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube