తెలంగాణలో బిజెపి చూపిస్తున్న దూకుడుకు టిఆర్ఎస్ పార్టీ చాలా రోజులుగా కలవరానికి గురవుతోంది.ఈ మధ్యకాలంలో ప్రజా వ్యతిరేకతను ఎక్కువగా ఎదుర్కోవడం, పార్టీ నుంచి పెద్దఎత్తున నాయకులు బీజేపీ చేరుతుండటం, ఈ మధ్య కాలంలో ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఇలా ఎన్నో కారణాలతో బీజేపీపై పూర్తిగా ఫోకస్ పెంచాలనే విషయంపై టిఆర్ఎస్ దృష్టి పెట్టింది.
ముఖ్యంగా తమను అదేపనిగా విమర్శిస్తూ, ఘాటు వ్యాఖ్యలు తో ఇరుకున పెడుతున్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను టార్గెట్ చేసుకునేందుకు తెలంగాణ నేతలు సిద్ధమైపోయారు.బిజెపి అంశాన్ని పెద్దగా ఎక్కడా ప్రస్తావించకుండా బండి సంజయ్ ను టార్గెట్ చేసుకుంటూ రాజకీయ వ్యూహం రచిస్తున్నారు. కేంద్రంతో కేసీఆర్ కాస్తో కూస్తో సఖ్యతగా వుంటూ వస్తున్నారు.వీలైనప్పుడల్లా కేంద్ర బిజెపి పెద్దలను కలుస్తూ, అనేక అంశాల పై చర్చిస్తూ వస్తున్నారు.నేపథ్యంలోనే బీజేపీని కాకుండా పూర్తిగా తమకు ఇబ్బందికరంగా మారిన బండి సంజయ్ ను టార్గెట్ చేసుకోవడం ద్వారా తమ రాజకీయ చతురతను టిఆర్ఎస్ ప్రదర్శిస్తోంది.టిఆర్ఎస్ కు పూర్తిగా రాజకీయ శత్రువు బండి సంజయ్ అనే విషయాన్ని హైలెట్ చేస్తూ, రాజకీయ విమర్శలకు పదును పెట్టింది.
బండి సంజయ్ సైతం పూర్తిగా కేసీఆర్, కేటీఆర్ తో పాటు టిఆర్ఎస్ లో ఉన్న కీలక నాయకులందరినీ టార్గెట్ చేసుకోవడం, ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలపై అదేపనిగా విమర్శలు చేస్తూ ప్రజలలో టిఆర్ఎస్ ఊపు తగ్గిస్తూ ఉండడం వంటి చర్యలతో మరికాస్త స్పీడ్ పెంచింది టిఆర్ఎస్.
తాజాగా చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగానే స్పందించారు.కబడ్దార్ బండి అంటూ ఘాటుగా హెచ్చరించారు.కేసీఆర్ పై నోరు పారేసుకుంటే నాలుక చీరేస్తాం బిడ్డా అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
అంతే కాదు బండి సంజయ్ ను తొండి సంజయ్ గా అభివర్ణించారు.అలాగే మరో టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సైతం బండి సంజయ్ కు వార్నింగ్ ఇచ్చారు.
కేసీఆర్ పై ఎవరు విమర్శలు చేయకూడదు అనే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు.మహారాష్ట్రలో శివసేన అధినేత బాల్ థాకరే గురించి ఎవరైనా చులకనగా మాట్లాడితే సేన కార్యకర్తలు ఎలా స్పందిస్తారో తెలంగాణలో కూడా అదే విధంగా స్పందించాలి అంటూ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కెసిఆర్ గురించి బండి సంజయ్ మరోసారి విమర్శలు చేస్తే తాట తీస్తాం అంటూ ఘాటుగా హెచ్చరించారు.
.