నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని గెలిపించాలని టీ.ఆర్.
ఎస్ నాయకులు బాగా కష్టపడుతున్నారు.ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు అక్కడి నేతలు.
సాగర్ ఉప ఎన్నికల్లో టీ.ఆర్.ఎస్ అభ్యర్ధిగా భగత్ రంగంలోకి దిగుతున్నారు.అతనికి మద్ధతుగా టీ.ఆర్.ఎస్ కేడర్ మొత్తం ప్రచారం చేస్తున్నారు.గురువారం ప్రచారంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరమర్తి లింగయ్య, శంకర్ నాయక్ లతో పాటుగా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి కూడా పాల్గొన్నారు.సాగర్ లో టీ.ఆర్.ఎస్ ప్రచారం విస్త్రుతంగా ఉందని తెలుస్తుంది.
అంతేకాదు ప్రచారంలో భాగంగా టీ.ఆర్.ఎస్ నేతలు వరికోయడం హాట్ న్యూస్ గా మారింది.త్రిపురారం మండలంలో లచ్చతండాలో వరికోసి కూలీలను కలిసి టీ.ఆర్.ఎస్ కు ఓటు వేయాలని అభ్యర్ధించారు.వారి పనిని నేతలు చేసి వారి కొద్దిపాటి విశ్రాంతిని ఇచ్చారు.ఏది ఏమైనా టీ.ఆర్.ఎస్ నేతలు ఇలా వరి కోయడం చూసి అందరు షాక్ అవుతున్నారు.ఎలాగైనా సరే సాగర్ ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని పార్టీ శ్రేణులు వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు.ఎలాగైనా సరే సాగర్ ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని పార్టీ శ్రేణులు వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు.
నోముల నర్సింహయ్య మృతిచెందడంతో అక్కడ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి.ఏప్రిల్ 17న పోలింగ్ కాగా.
మే 2న ఓట్ల లెక్కింపు జరుగనుంది.