కే.సి.ఆర్ ను విమర్శించడం దాని ద్వారా గెలవాలనుకోవడం సాధ్యం కాని విషయమని అన్నారు తెలంగాణా మంత్రి కే.టి.ఆర్.కే.సి.ఆర్ కంటే ఎక్కువగా తెలంగాణాని ప్రేమిస్తేనే అది సాధ్యమయ్యే అవకాశమని అన్నారు.నిన్నకాక మొన్న పదవులు వచ్చిన వారు కూడా కే.సి.ఆర్ పై ఎగిరెగిరి పడుతున్నారని కే.టి.ఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కే.సి.ఆర్ తో తలపడటానికి డైలాగులు కొడితే సరిపోదని చెప్పారు. కే.సి.ఆర్ ను తిట్టడం ద్వారా శునకానందం పొందడం తప్ప మరేమీ లేదని చెప్పారు కే.టి.ఆర్.వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిలతో కొట్లాడిన చరిత్ర కే.సి.ఆర్ దని అన్నారు.
దుబ్బాక, జి.హెచ్.ఎం.సి లో నాలుగు సీట్లను గెలిచే సరికి బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారని.ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని గుర్తుచేశారు.టి.ఆర్.ఎస్ ను కే.సి.ఆర్ ను ఎదుర్కొనే శక్తి తెలంగాణాలో ఎవరికీ లేదని ఈ సందర్బంగా చెప్పారు కే.టి.ఆర్.
అటు రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా సోనియాని తెలంగాణా తల్లిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి పై కూడా విమర్శలు చేశారు కే.టి.ఆర్. కే.సి.ఆర్ ని విమర్శించే వారందరిని కలుకుపుని టార్గెట్ చేస్తూ కే.టి.ఆర్ కామెంట్స్ వైరల్ గా మారాయి.