టీఆర్‌ఎస్‌ ఎంపీ కేశవరావు ఓటుపై బీజేపీ ఎంపీల ఫిర్యాదు

తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్‌ మరియు కార్పోరేషన్‌ ఎన్నికల్లో ఎంపీ కేశవరావు ఎక్స్‌ అఫిషియో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది.అయితే కేశవరావు ప్రస్తుతం ఆంధ్రా నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

 Trs Keshavar Rao Bjp Vote-TeluguStop.com

ఈ కారణంగా ఆయన ఓటు తెలంగాణలో చెల్లదు.కాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగంకు పాల్పడి ఆయన్ను ఓటు వేసేలా చేసింది అంటూ బీజేపీ నాయకులు గత కొన్ని రోజలుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే.

ఇదే సమయంలో బీజేపీ ఎంపీలు పలువురు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడును కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేయడం జరిగింది.ఆయన తెలంగాణలో ఎలా ఓటు హక్కును వినియోగించుకుంటారు అంటూ బీజేపీ ఎంపీలు ప్రశ్నిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ వెంకయ్య నాయుడికి ఫిర్యాదు చేయడం జరిగింది.

మరి ఈ విషయమై వెంకయ్య నాయుడు ఎలా రెస్పాండ్‌ అవుతాడో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube