మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడింది అంటూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం పదే పదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.రాష్ట్రం మొత్తం మీద కేవలం రెండు మన్సిపాలిటీలను దక్కించుకున్న బీజేపీ మాపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది అంటూ కామెంట్స్ చేశాడు.
రాష్ట్రంలో బీజేపీకి స్థానమే లేదని, మొత్తం మీద రెండు వేల చోట్ల పార్టీకి అభ్యర్థులు కూడా కరువయ్యారు అంటూ కేటీఆర్ ఎద్దేవ చేశాడు.
రాష్ట్రంలో మొత్తం 92 మున్సిపాలిటీలను మేము దక్కించుకుంటే మీరు దక్కించుకుంది కేవలం రెండు మున్సిపాలిటీలను.
అది కూడా చాలా కష్టపడి మీరు వాటిని దక్కించుకున్నారు.అలాంటి దానికి మీరు ఎగిరెగిరి పడుతున్నారు ఏంటీ అంటూ కేటీఆర్ ప్రశ్నించాడు.
విపక్షాలు ఓటమికి కారణాలు వెతుక్కుని దాన్ని సరి చేసుకోవడం మానేసి మమ్ములను విమర్శించే అర్హత ఎక్కడిది అన్నాడు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటమి పాలైతే ఈవీఎంలు కారణం అన్నారు, ఇప్పుడేమో మరేదో కారణం చెబుతున్నారు.
ఉత్తమ్కు ఎన్నికల వ్యవస్థపై మరియు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయినట్లుగా ఉందంటూ కూడా కేటీఆర్ అన్నాడు.