మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం మదారం, ఎదులబాద్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. అలాగే ప్రతాప సింగారం గ్రామంలో 1.5 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించబోతున మల్టి పర్పస్ ఫంక్షన్ హల్ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తెరాస ప్రభుత్వం అని ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీ ఛైర్మెన్ శరత్ చంద్ర, సర్పంచ్ లు, సొసైటీ డైరెక్టర్లు, రైతులు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.