హైదరాబాద్ లో మరికాసేపట్లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ప్రారంభంకానుంది.ఈ సమావేశానికి 283 మంది ప్రతినిధులను ఆహ్వానించారు సీఎం కేసీఆర్.
ఈ సమావేశంలో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఏకవాక్య తీర్మానం చేయనున్నారు.అనంతరం మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీకి సంబంధించిన రూపొందించిన పేపర్లపై కేసీఆర్ సంతకం పెట్టనున్నారు.సమావేశం తర్వాత ప్రతినిధులు, అతిథులతో కలిసి లంచ్ చేయనున్నారున.
అనంతరం సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించనున్నారు.ఈ క్రమంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు ఇప్పటికే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, తమిళనాడు వీసీకే పార్టీ అధినేత తిరుమావవళన్ లు హాజరైన సంగతి తెలిసిందే.