తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపుతిరుగుతున్న పరిస్థితి ఉంది.పరిణామాలు కూడా వేగంగా మారుతున్న విషయాల్ని మనం చూస్తున్నాం.
అయితే గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు చాలా వరకు బలహీనంగా ఉన్న పరిస్థితి ఉంది.అందుకే చాలా సునాయాసంగా ఎటువంటి గట్టి పోటీ లేకుండా టీఆర్ఎస్ అత్యధిక స్థానాలలో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది.
కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.గతంతో పోలిస్తే ప్రతిపక్షాలు చాలా బలంగా ముందుకు సాగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ ఇటు కాంగ్రెస్ కావచ్చు,బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ ను ఇరుకున పెడుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ప్రస్తుత పరిణామాలు గత రెండు సార్వత్రిక ఎన్నికల పరిణామాల కంటే భిన్నంగా ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైన పరిస్థితి ఉంది.
అందుకే ఇప్పటి నుండే సార్వత్రిక ఎన్నికలపై టీఆర్ఎస్ పెట్టడానికి పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.ఎందుకంటే ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ పెద్ద ఎత్తున దూసుకుపోతున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ అధికారంలో ఉంది కావున విమర్శలకు ప్రతి విమర్శలు గుప్పిస్తే ప్రజలు హర్షించరు.ప్రజలు పనిని కోరుకుంటారు.
అందుకే ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల విమర్శలకు ఆచితూచి స్పందిస్తున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ కూడా ఇప్పటికే సర్వే చేయించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రజలు ఏయే విషయాల పట్ల ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారనే విషయంపై ఒక నివేదిక ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది.దానికనుగుణంగానే ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికలు ఉండే అవకాశం వంద శాతం ఉంది.
ఎందుకంటే ప్రజాగ్రహ విషయాలపై ప్రభుత్వం దృష్టి సారించకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందనే విషయం కెసీఆర్ కు తెలియనిది కాదు.ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీకి ఈ రెండున్నర సంవత్సరాల సమయం చాలా ముఖ్యమనదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్న పరిస్థితి ఉంది.