హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఇప్పుడు అన్ని పార్టీలకు పెద్ద టాస్క్ లాగా మారిపోయింది.గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం అందరికీ భయంగానే ఉంది.
ఎందుకంటే ఇక్కడ గనక ఓడిపోతే ఇప్పుడు పార్టీ పరువు గంగలో కలుస్తుందని టీఆర్ ఎస్, బీజేపీ భావిస్తున్నాయి.పట్టుబట్టి ఉప ఎన్నికకు వెళ్లిన ఈటల రాజేందర్ గెలుపుపై బీజేపీ భవిష్యత్ ఆధారపడింది.
అలాగే ఇక్కడ ఈటలను ఓడిస్తే తమకు రాబోయే ఎన్నికల్లో తిరుగుండదని ఇదో సంకేతంలా చెప్పాలని టీఆర్ ఎస్ చూస్తోంది.మొత్తానికి అన్ని పార్టీలు దీన్ని వచ్చే ఎన్నికలకు రిహార్సల్ లాగా చూస్తున్నాయి.ఇక ఈ నెలలలోనే భవితవ్యం తేలిపోనుండగా అటు బీజేపీ, ఇటు టీఆర్ ఎస్ పార్టీలు పోటా పోటీగా ప్రచారాలు విమర్శలు కూడా చేసుకుంటున్నాయి.దీంతో అసలు ఇక్కడ గెలిస్తే ఎవరు లాభ పడుతారు, ఎవరికి నష్టమనే దానిపై పెద్ద ఎత్తున అంచనాలు వేసుకుంటున్నాయి ఇరు పార్టీలు.
ఇప్పటికే దళితబంధు లాంటి స్కీమ్ను అమలు చేస్తున్న టీఆర్ ఎస్ అసలు తమకు ప్రజల్లో ఎలాంటి అనుకూలత ఉందనే దానిపై ఇప్పటికే సర్వేలు కూడా చేయించుకుంటోంది.అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో ఎలాంటి రియాక్షన్ ఉందనే దానిపై సర్వేలు చేయిస్తోంది.
దాంతో పాటు రీసెంట్ గా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందనే దానిపై కూడా వివరణ తీసుకుంటున్నారంట.కేటీఆర్ మాట్లాడుతూ హుజురాబాద్ లో ఓడిపోతే తమకే పెద్ద నష్టమేం లేదని గెలిస్తే ఒక సీటు మాత్రమే తమ పార్టీకి పెరుగుతుందని చెప్పడం కొంత వ్యతిరేకతకు దారి తీసింది.కాబట్టి లాంటి అనుకూల వ్యతిరేత పరిణామాలపై సర్వేలు చేయిస్తున్న టీఆర్ ఎస్ సర్వేల్లో అనుకూలత వస్తే గనక ఈ నెలలో సీఎం కేసీఆర్ స్వయంగా రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
.