ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే తనకేమీ నష్టం ఏమీ లేదని హాయిగా ఇంట్లో పడుకుని విశ్రాంతి తీసుకుంటానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.ఆగమాగం కావోద్దు, ఎన్నికలు వస్తాయి, పోతాయి… ప్రజలు గెలవాలి… నాయకులు, పార్టీలు కాదన్నారు.
ఏఊరికాఊరికి కాంగ్రెస్ ఉంది… దాని వెంట రెండు మూడు చిల్లర పార్టీలు కూడా ఉన్నాయి… పార్టీల గత చరిత్ర ఏంది.నోట్ల కట్టలు దించాలనే దుర్మార్గమైన పద్ధతి తెచ్చారు అని మండిపడ్డారు.
కాంగ్రెస్, టీడీపీ 58 ఏళ్ల పాలన ఏమైంది.నాలుగేళ్ల పసిగుడ్డు ఏంచేసింది మీకు తెలుసే అన్నారు.
కండ్ల ముందు అంత కనబడుతుంది… నేను రైతునే.నామోటార్లు కూడా కాలిపోయాయి… ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయాయి… పెద్దపెద్ద మాటలు మాట్లాడిన వాళ్లు ఏపీలో కూడా 24 గంటల కరెంట్ ఇవ్వలేదు… కానీ, మేం తెలంగాణ ఇచ్చామని… దేశంలోనే 24 గంటల కరెంట్ ఇచ్చిన ఏకైక పార్టీ టీఆర్ఎస్సే అన్నారు.రూ.12 వేల కోట్లు ఖర్చు చేసి 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చాం… కాంగ్రెస్ పార్టీ తప్పిపోయి అధికారంలోకి వస్తే కరెంట్ మళ్లీ కిందమీద అవుతుందన్నారు.వాళ్లకు తెలివిలేదు… రాష్ట్రం నేను తెచ్చిన.ఏరుబడ్డ సంసారం ఇప్పుడే గాడిలో పడుతుందా? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు.