తెలంగాణ ఎన్నికల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చాలా చురుగ్గా వ్యవహరించాడు… అంతే కాదు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ .కేటీఆర్ లను టార్గెట్ చేసుకుని భారీ భారీ డైలాగులు కూడా వదిలాడు.అయితే… బాబు ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీని బాగా ఇబ్బంది పెట్టాయి.ఇంకేముందు వెంటనే కేటీఆర్ ఈ విషయంపై స్పందించాడు.
తెలంగాణ రాజకీయాల్లో బాబు వేలు పెడుతున్నాడు… మేము కూడా ఏపీ రాజకీయాల్లో వేలు పెడతాము అంటూ… ఆగ్రహం వ్యక్తం చేసాడు.
ఇప్పుడు అదే విషయంపై పార్టీ గెలుపు ఆనందంతో ఉన్న కేసీఆర్ స్పందించాడు.కొద్ది సేపటి క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ… చంద్రబాబు ఇక్కడకు వచ్చినప్పడు తాము అక్కడకు వెళ్లమా అని ప్రశ్నించారు.చంద్రబాబు తెలంగాణకు వచ్చి పనిచేశారని.
అటువంటప్పుడు తాము కూడా ఆంధ్రకు వెళ్లి పనిచేయాలా వద్దా అని ప్రశ్నించారు.బర్త్డే గిఫ్ట్ ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమా? అని అన్నారు.దేశ రాజకీయాల్లో పనిచేసే క్రమంలో ఏపీకి కూడా వెళ్లబోతున్నానన్నారు.ఆంధ్రప్రదేశ్ నుంచి తనకు లక్ష ఫోన్ కాల్స్ వచ్చాయని.ఏపీ రాజకీయాల్లో తాను కూడా కలగజేసుకోవాల్సిందిగా అక్కడి ప్రజలు కోరుతున్నారన్నారు.చంద్రబాబు గురించి విజయవాడ వెళ్లి మొత్తం చెబుతానన్నారు.
మేము ఇచ్చే గిఫ్ట్ ప్రభావం ఎంత ఉంటుందో త్వరలోనే చంద్రబాబు చూస్తాడని కేసీఆర్ వ్యాఖ్యానించారు.