తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ భరితమైన సన్నివేశం ఆవిష్కృతం అవుతుంది.దీనికి కారణం నాగార్జునసాగర్ లో జరగనున్న ఉపఎన్నిక.
కాగా ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఉత్సాహంలో ఉన్న టీయార్ఎస్ పార్టీ, సాగర్లో కూడా విజయం సాధించి తెలంగాణ ప్రజలు ఇంకా మావైపే ఉన్నారని నిరూపించాలని ఊవ్విళ్లూ ఊరుతుండగా, బీజేపీ మాత్రం కారు గుర్తును పంక్చర్ చేయాలని ఆశపడుతుందట.
ఇక కాంగ్రెస్ కూడా ఎక్కడలేని సత్తువను తెచ్చుకుని ఒక్క అవకాశం అంటూ కళ్లల్లో కొవ్వత్తులు వేసుకుని కాపల కాస్తుందట విజయం కోసం.
ఇక ఇక్కడ విజయం ఎవరిని వరిస్తుందో తెలియదు గానీ పార్టీల అభ్యర్థిత్వం ఖరారు విషయమే తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
నామినేషన్కు ఒక్క రోజే గడువు ఉండగా తాజాగా టీఆర్ఎస్ పార్టీ తరపున ఉపఎన్నికలో ఎవరు పోటీ చేయనున్నారనే అంశంపై క్లారిటీ వచ్చింది.
సాగర్ బరిలో ఉపఎన్నిక అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య తనయుడు నోముల భగత్కు టికెట్ ఖరారయ్యినట్లు సమాచారం.కాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.