తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను కేవలం ఐదు నిమిషాల్లోనే ఆమోదించారని విమర్శించారు.
మునుగోడులో ఎన్నికలకు అంత అర్జెంట్ ఏముందని ప్రశ్నించారు.
గతంలో హుజురాబాద్ ఉపఎన్నికైనా, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికైనా వారి అవసరాల కోసం మాత్రమేనని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
మరోవైపు మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతుంది.ఈ క్రమంలో గాంధీభవన్ లో ఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశం అయింది.అనంతరం పీసీసీ అనుబంధ సంఘాల ఛైర్మన్లతో భేటీ జరిగింది.