సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎంతో డిమాండ్ వుంటుంది.ఒక సినిమాలో చూసిన హీరోయిన్ ను పదేపదే సినిమాలో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడరు ఈ క్రమంలోనే కొత్త హీరోయిన్ల కోసం దర్శక నిర్మాతలు ఎంతో శ్రమిస్తూ ఉంటారు.
ఇక సీనియర్ హీరోలు అయిన చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ వంటి వారికి హీరోయిన్లు దొరకాలంటే ఎంతో కష్టం.ఇలా వీరి సినిమాలలో హీరోయిన్ల కోసం దర్శక నిర్మాతలు హీరోయిన్లకు పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అందిస్తూ హీరోయిన్లను తీసుకుంటారు.
ఇప్పుడు ఈ హీరోయిన్ కష్టాలు పవన్ కళ్యాణ్ కు తప్ప లేదని తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్నటువంటి హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ తో పాటు ముందుగా జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఫైనల్ చేశారు.
మొదటి సారిగా పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక చిత్రంలో నటించడం వల్ల ఇందులో రాణి పాత్ర కోసం ఈమెను ఎంపిక చేసుకున్నారు.ఇక సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయిన తర్వాత జాక్వెలిన్ మనీలాండరింగ్ కేసులో భాగంగా సుకేశ్ చంద్రశేఖర్ తో సంబంధాలున్నాయని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఈడీ అధికారులు ఈమెను విచారించడంతో దర్శకుడు క్రిష్ అనవసరంగా రిస్కు చేయడం ఎందుకు అని భావించి ఈ సినిమా నుంచి ఈమెను తప్పినట్లు తెలుస్తోంది.ఈమె స్థానంలో మరో హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారు.ఇప్పటికే నర్గీస్ ఫక్రీ, లారిస్సా బొనెసి వంటి వారిని సంప్రదించగా.వారు పలు కారణాల చేత రిజెక్ట్ చేశారని టాక్. మరి ఈ సినిమాలో పవన్ సరసన రాణి పాత్రలో ఏ హీరోయిన్ నటిస్తారో తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు