తెలంగాణలో ఈటెల వ్యవహారం పెద్ద రచ్చకే దారి తీస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈటెల కేసీఆర్ పై గత కొద్ది కాలంగా పరోక్ష విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న ఈటెల రాజేందర్ పై కేసీఆర్ ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు.
అయితే ఈటెలపై విచారణ ప్రారంభించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ ఈటెల విరుచుకపడ్డాడు.ఆ తరువాత హైదరాబాద్ నుండి హుజురాబాద్ కు పెద్ద కాన్వాయ్ తో వెళ్తున్న క్రమంలో ముదిరాజ్ నేతలను కలుస్తూ ముందుకు సాగాడు.
అయితే ఆ కాన్వాయ్ ఇది చూసిన తరువాత ఈటెల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెడుతున్నట్టు పుకార్లు రావడం జరిగింది.
అయితే ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో విమర్శలు చేయించి ఈటెలను నియోజకవర్గానికే పరిమితం చేశారు.
ఇక హుజురాబాద్ టీఆర్ఎస్ నేతలకు చెక్ పెట్టి ఈటెలను ఒంటరిని చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.ఇప్పటికే గంగుల అండ్ టీం దీనిపై వ్యూహాలు రచిస్తోంది.తాజాగా ఈటెల ప్రధాన అనుచరుడిని టీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేసింది.మరి ఇంకా ఎటువంటి వ్యూహాలతో ఈటెలకు చెక్ పెడతారానేది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠగా మారింది.
ఒక్క అనుచరుడి సస్పెండ్ తో ఊరుకుంటారా లేక ఇంకా సస్పెన్షన్లు కొనసాగే అవకాశం ఉందా అనేది చూడాల్సి ఉంది.